Thursday, May 16, 2024

మాజీ సి ఐ దాసరి భూమయ్య అరెస్ట్

కరీంనగర్ – మాజీ సీఐ , తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం కరీంనగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్న సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు దాసరి భూమయ్యను అరెస్ట్ చేశారు.

ఈ మేరకు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు . కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. భూమయ్య రిటైర్ కాకముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ఏసీబీ అధికారులు పట్టుకుని సోదాలు నిర్వహించారు . ఆయన కారులో డబ్బు దొరకడంతో అక్రమ నగదు స్వాధీనం చేసుకున్న కేసు నమోదు చేశారు . ఈ వ్యవహారం తరువాత భూమయ్యపైఎలాంటి కేసులు అయితే నమోదు కాలేదు . హస్నాబాద్ ఠాణాలో తుపాకుల మిస్సింగ్ విషయంలో కూడా భూమయ్యను భాధ్యున్ని చేసి నోటీసులు ఇచ్చినప్పటికీ అవి మరో వ్యక్తి వద్ద లభ్యం కాగా ఈ వ్యవహారానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.

భూమయ్య రిటైడ్ అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ లో చేరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలోగులాభి కండువా కప్పుకున్న భూమయ్య ఆ తరువాత బయటకు వచ్చారు . తీన్మార్ మల్లన్న టీంతో కలిసి పనిచేసిన భూమయ్య మల్లన్న బీజేపీలో చేరగానే దూరంగా ఉన్నారు . తీన్మార్ మల్లన్న బీజేపీని వీడడంతో తిరిగి అయనతో కలిసి పనిచేస్తున్నారు. భూమయ్యపై ఏ కేసు నమోదు చేశారో తెలవలసి ఉంది. భూమయ్య అరెస్ట్ మాత్రం కరీంనగర్ లో కలకలం సృష్టిస్తోంది అని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement