Monday, April 29, 2024

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

.అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇంట్లో జరుగుతున్న హైస్కూల్‌ ప్రోమ్‌ పార్టీపై కాల్పులు జరిపాడు..ఈ ప్రమాదంలో 9 మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. అమెరికాలోకి టెక్సాస్‌లో జాస్పర్‌ కౌంటీలో ఉన్న ఓ ఇంట్లో హైస్కూల్‌ ప్రోమ్‌ పార్టీ జరుగుతోంది. ఈ సందర్భంగా పిల్లలందరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ దుండగుడు ప్రోమ్‌ పార్టీపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, కాల్పుల్లో గాయపడిన వారంతా 15-19 ఏళ్ల మధ్య వారుగా తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.ఇక, కాల్పల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు జాస్పర్‌ కౌంటీ షరీష్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement