Sunday, May 5, 2024

ప్ర‌తి ఒక్క‌రూ త‌ల్లిదండ్రుల‌ను ఆద‌రించాలి : రాంరెడ్డి

తమను కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చౌటుప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దోనూరు రాంరెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలంలోని పెద్ద కొండూరు గ్రామంలో గల సాయి సేవ వృద్ధాశ్రమంలో చౌటుప్పల్ ప్రెస్ క్లబ్ (రి.నెం:506/2021) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంరెడ్డి-రమాదేవి దంపతులు ప్రారంభించారు. వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు. పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దోనూరు రాంరెడ్డి మాట్లాడుతూ…. చౌటుప్పల్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నుకున్న సందర్భంగా ఈరోజు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంతటి ప్రకృతి విశాలంలో, ఎంతో సహృదయంతో మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి జానకమ్మ దంపతులు వృద్ధుల కోసం నెలకొల్పిన ఆశ్రమం వృద్ధులకు ఒక దేవాలయంగా మారిందన్నారు. ఈ సందర్భంగా మేరెడ్డి సత్యనారాయణరెడ్డి జానకమ్మ దంపతుల సేవలను కొనియాడారు. అనంతరం సాయి యాదాద్రి సేవ ఆశ్రమం అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ… చౌటుప్పల్ ప్రెస్ క్లబ్ వారు సాయి సేవ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పిసాటి నాగరాజురెడ్డి, ఉపాధ్యక్షులు ఎరసాని సతీష్, బొమ్మ మల్లేశం, సహాయ కార్యదర్శులు సిలివేరు శ్రీనివాస్, పల్లపు కృష్ణ, ట్రెజరర్ ‌‌‌‌ఊదరిశంకర్, ప్రచార కార్యదర్శులు కొండమడుగు శ్రావణ్, ఊదరి శ్యామ్ సుందర్, కార్యవర్గ సభ్యులు దబ్బటి భూషణ్, తలారి మహేష్, మాదగోని కిరణ్, చింతకింది కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement