Saturday, May 18, 2024

TS: మృత్యువులోనూ వీడ‌ని స్నేహ బంధం…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో బావిలో ఇద్దరు స్నేహితులు పడి మృత్యు వాత పడ్డారు. తుమిడే హరీశ్(22), కంబాల మహేష్(22) ఇద్దరు స్నేహితులు. ఆదివారం సాయంత్రం ఒక పెండ్లికి వెళ్లిన వారిద్దరూ చేను వద్దకు వెళ్లారు.

బైక్ కొద్ది దూరంలో పార్క్ చేసి బావి వద్దకు వెళ్లారు. అక్కడ చీకటిగా ఉండటంతో ప్రమాదవశాత్తూ జారి పడ్డారా…? లేక ఈతకు వెళ్లి చనిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది. బావి సమీపంలో మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఉద‌యం బావిలో రెండు శ‌వాలు తేల‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement