Tuesday, April 30, 2024

TS | మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు తథ్యం: ఎంపీ రవిచంద్ర

మున్నూరుకాపు సంఘం 33జిల్లా శాఖల అధ్యక్షులతో ఇవ్వాల (ఆదివారం) సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరు కాపులకు సముచిత గౌరవం ఇచ్చారని, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గతంతో కంపేర్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వంలో మున్నూరుకాపులకు గౌరవప్రదమైన పదవులు లభించాయన్నారు. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా తథ్యమన్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో సంఘం 33జిల్లా శాఖల అధ్యక్షుల సమావేశం జరిగింది.

సంఘం గౌరవాధ్యక్షులైన ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేసీఆర్ గతంలోనే సానుకూలంగా స్పందించారన్నారు. తాను, మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ కేశవరావు ఆధ్వర్యంలో మున్నూరుకాపు ప్రజాప్రతినిధులను వెంట తీసుకుని సీఎం కేసీఆర్ ను త్వరలో కలుస్తామని తెలిపారు. కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా, మున్నూరుకాపు ప్రముఖులు పలువురికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని ఎంపీ రవిచంద్ర వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement