Sunday, May 5, 2024

NLG :పెన్‌ప‌హాడ్‌లో కాంగ్రెస్ నేత‌ల గ‌డ‌ప‌గ‌డ‌ప ఎన్నిక‌ల ప్రచారం

పెన్ పహాడ్, నవంబర్ 22(ప్ర‌భ‌న్యూస్‌) కాంగ్రెస్ ప్రభుత్వం తోనేబడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గడపగడప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతమందికి వచ్చాయని ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలుసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని ఆరు గ్యారెంటీ స్కీంలు అమలు అవుతాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యేఅభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు కోసం చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. భారీ జనంతో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్య పద్మ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు సైదులు, నెమ్మాది లింగయ్య, వగ్గు రవి, మెంతబోయిన మల్లేష్, మున్న లింగయ్య, షేక్ సైదులు, ఒగ్గు నాగయ్య ,చనగాని రాంబాబు, నెమ్మాది లేనిన్, గుండెబోయిన శ్రీశైలం, దేవులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement