Wednesday, May 1, 2024

నేడు క‌రీంన‌గ‌ర్ లో బిజెపి హిందూ ఏక్తా యాత్ర‌…

క‌రీంన‌గ‌ర్ – హ‌నుమాన్ జ‌యంతిని పురస్క‌రించుకుని బిజెపి నేడు హిందూ ఏక్తా యాత్ర పేరిట క‌రీంన‌గ‌ర్ లో నిర్వ‌హించ‌నుంది.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జ‌రిగే ఈ యాత్రకు అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. కరీంనగర్ సిటీలో సాయంత్రం 4 గంటలకు ఆర్యవైశ్య భవన్ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్ర.. రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్డు, కమాన్ చౌరస్తా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా తిరిగి ఆర్యవైశ్య భవన్ కు చేరుకుంటుంది. అక్క‌డ జరిగే స‌భ‌లో నేత‌లు ప్ర‌సంగిస్తారు..ఈ యాత్ర‌లో భారీగా ప్ర‌జ‌లు పాల్గొనాల‌ని బండి సంజ‌య్ పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement