Friday, April 26, 2024

ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి: మంత్రి కొప్పుల

ఉపాధ్యాయుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో పీఆర్టీయూ టీఎస్‌ డైరీలను మంత్రి కొప్పుల ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పీఆర్టీయూ చేస్తున్న పోరాటాన్ని మంత్రి అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో పీఆర్టీయూ సంఘం బాధ్యులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement