Tuesday, March 26, 2024

నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కేపీ

నిరుపేద‌ల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 45 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.29,95,500ల‌ విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ… నిరుపేదలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement