Friday, May 10, 2024

నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌ గా ఈగ సంజీవ్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఈగ సంజీవ్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిం ది. 2001 నుండి సంజీవ్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్నాడు. సోమవారం నియామకానికి సంబంధించిన జీ వో కాపీని ఎమ్మెల్సీ కవిత , ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా ఈగ సంజీవ్ రెడ్డికి అందజేసారు.

ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్ధన్,గణేష్ బిగాల కు ఈగ సంజీవ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఈగ సంజీవ్ రెడ్డి మాట్లాడు తు.. నాపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement