Sunday, May 12, 2024

Education : ప్ర‌శాంతంగా ముగిసిన టీఎస్ ఈ సెట్.. రేప‌టినుంచి టీఎస్‌ పీజీఈసెట్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేప‌టినుంచి అంటే ఆగ‌స్ట్ 2నుంచి ఈనెల 5వ తేదీ వరకు టీఎస్‌ పీజీఈసెట్‌ పరీక్ష జరగనుంది. ఎంఈ/ఎంటెక్‌/ఎంఫార్మ్‌/ఎం.ఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌డి తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు సెషన్‌లలో పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14,933 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు (సోమవారం) జరిగిన టీఎస్‌ ఈసెట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement