Sunday, April 28, 2024

Huzurabad Bypoll: ఓటేసి ఈటల.. గెలుపుపై ధీమా

హుజురాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. కమలాపూర్ మండల కేంద్రంలోని 262 వ పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా, ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ కు ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆపార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ ను బరిలో నిలిపింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement