Thursday, April 25, 2024

బద్వేలు ఉపఎన్నిక: కడప ఎస్సీకి సోము ఫిర్యాదు

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, బద్వేలు నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో బిజెపి ఏజెంట్లును ఇబ్బందులుకు గురి చేసిన సంఘటనలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జిల్లా ఎస్పీ అన్భురాజన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డి పల్లి గ్రామాల్లో తిరుగుతూ బీజేపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన ఎసై చంద్రశేఖర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాదు, ఎన్నికల అబ్జర్వర్ కు ఫిర్యాదు చేశారు. తిరువెంగళాపురం పోలింగ్ బూత్ వద్ద కేంద్రబలగాలు లేకపోవడంపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ వద్ద సోమువీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోరుమామిళ్ళలో బయట వ్యక్తులు మొహరింపు విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: Air India: ఎంపీలు విమాన టికెట్లు కొనాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement