Sunday, April 28, 2024

RR: డబ్బా మాటలు వద్దు.. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వండి.. మిథున్ రెడ్డి

షాద్ నగర్, ఆగస్టు 23, ప్రభ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, డబ్బా మాటలు వద్దు.. డబుల్ బెడ్రూమ్ ఇవ్వండని బీజేపీ రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బుధవారం ఆయన ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు మిథున్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఋషికేష్ తదితరులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా మిథున్ మాట్లాడుతూ… గత తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ పాలనలో ఇదిగో డబుల్ బెడ్ రూమ్ అదిగో డబుల్ బెడ్ రూమ్ అంటూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటూ ఓట్లు దండు కుంటున్నారు తప్పా, ఏ ఒక్క నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు అందలేదని మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లు, పేద ప్రజలకు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ లు కూడా స్థానికులకు త్వరగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సూచించిన వారికి లోలోపల కేటాయిస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వకుండా అర్హులైన నిరుపేదలకు, స్థానికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement