Monday, May 6, 2024

Boycot Polling : డ‌బ్బులివ్వ‌లా… ఓట్లు వేయలే..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని స్పష్టం చేశారు. అలాగే వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు.

వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం, గొల్లగూడెం గ్రామస్తులు ఓటేయమని మొండికేశారు. ఆయా పార్టీల నేతలు తమకు డబ్బులు ఇవ్వలేదని, తాము ఓటు వెయ్యబోమని గ్రామంలోని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులిస్తేనే ఓటేస్తామని తెగేసి చెబుతున్నారు. అసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని వరిపేట గ్రామస్తులు ఓటేసేందుకు నిరాకరించారు. తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ పోలింగ్ ను బహిష్కరించారు. గ్రామంలో పోలింగ్ కు దూరంగా ఉండిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement