Saturday, May 4, 2024

చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు – జిల్లా ఎస్పీ ఎం రమణ కుమార్

సంగారెడ్డి, జూలై 20 (ప్రభ న్యూస్): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ సూచించారు. జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అప్రమత్తం చేశారు. వచ్చే మూడు రోజులు కూడ వర్ష సూచన ఉన్న దృష్ట్యా వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉన్నాయీ కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు,యువత ఎవరూ చెరువుల వైపు వెళ్ళొద్దు అని అన్నారు.

ఆయా గ్రామాల సర్పంచులు చెరువుల వద్ద మరియు వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్100 సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు దృష్ట్యా పోలీసు అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు,కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల దృష్ట కరెంటు స్తంభాల దగ్గర కు ఎవరు వెలకుడదని అన్నారు. రోడ్ల పైన ఎలాంటి చెట్లు పడిన పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement