Monday, May 20, 2024

Delhi: మోడీ, అమిత్ షాలతో పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ

ఢిల్లీ… బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణ, తమిళనాడు సంస్థాగత అంశాలపై మాట్లాడడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… బెంగుళూరులో విపక్షాలు India అని పేరు పెట్టుకున్నారు, అందులో బెయిల్ స్కాంలో ఉన్న నేతలే ఎక్కువగా ఉన్నారన్నారు. మూడోసారి కూడా మోడీ ప్రధాని అవుతారన్నారు. ఖమ్మంలో 29వ తేదీన అమిత్ షా పర్యటన ఉంటుందన్నారు. తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల్లో అవినీతి జరుగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా డ్రామాలు చేయాలని స్క్రిప్ట్ రాసుకుంటున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement