Thursday, May 16, 2024

శివ పరమాత్మ దివ్య అవతరణ.. మౌలాలిలో 18న కార్యక్రమం..

మౌలాలి: ఓం మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 18న తండ్రి శివ ప‌రామ‌త్మ దివ్య అవ‌త‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. సికింద్రాబాద్‌.. మౌలాలీలోని సౌత్ రైల్వే ఫంక్షన్ హాల్ సికింద్రాబాద్ లో ఉదయం 10:30 కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుడి ప్రేమ, ఆశీర్వాదలకు పాత్రులు కావాల‌ని ఓం మండ‌లి ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కార్యక్రమానికి ఓం మండలి శివశక్తి అవతార్ అధ్యక్షురాలు దేవికి మాతాజీ , ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాయపూర్. మల్లికార్జున్ రెడ్డి హైదరాబాద్ ఇంచార్జ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఓం మండలి సేవకులు పాల్గొంటారని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రవేశం ఉచితం, ప్రసాదం కూడా అంద‌జేయ‌నున్నారు. ఉదయం, మధ్యాహ్నం భోజనం వసతి ఉంటుంద‌ని ఓం మండ‌లి తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండ‌లి నిర్వాహ‌కులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement