Saturday, May 18, 2024

బీజేపీ ఆఫీసు దగ్గర డిజిటల్​ బోర్డు.. 50వేలు ఫైన్​ వేసిన జీహెచ్​ఎంసీ

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్‌ బోర్డుకు జీహెచ్‌ఎంసీ భారీ జరిమానా విధించింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’ అనే డిజిటల్‌ కౌంట్‌డౌన్‌ బోర్డును బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు.

అయితే.. అధికారుల అనుమతి లేకుండా బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) అధికారులు రూ.50 వేలు జరిమానా విధించారు. దీంతో బీజేపీ నేతలు ఆ బోర్డును కనిపించకుండా తొలగించడంతో సోషల్​ మీడియాలో ‘‘స్క్రీన్​ పీకింది.. అంత భయమా?” అంటూ కామెంట్స్​ హల్​ చల్​ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement