Saturday, May 4, 2024

ముత్తోజి పేట టోల్ గేట్ ముందు ధర్నా

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ముత్తోజీ పేట గ్రామ పరిధిలోని జాతీయ రహదారి 365పై ఉన్న టోల్ గేట్ వద్ద గ్రామ వాసులు ఆందోళన నిర్వహిస్తున్నారు.టోల్ గేట్ లో పనిచేసే గీసాపాక సురేందర్ ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణపాయం లో ఉన్నారని,టోల్ గేట్ యాజమాన్యం ఆదుకోవాలని గ్రామ వాసులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.వృత్తి నిర్వహణలో భాగంగా ప్రయాణం చేసే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు వినికిడి.జాతీయ రహదారి పై ఆందోళన విషయం తెలుసుకున్న సీఐ రవి కుమార్,ఎస్సై చరణ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో చర్చించి ఆందోళన విరమింప చేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement