Thursday, May 2, 2024

దోబీ ఘాట్ అభివృద్ధికి కృషిచేస్తాన‌న్న‌ డిప్యూటీ మేయర్

తార్నాక ఎర్రకుంట చెరువు రజకులు దోబీ ఘాట్ లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి పేర్కొన్నారు. తార్నాక ఎర్రకుంట చెరువు ప్రాంతంలో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రజక కులస్తులు దోబీ ఘాట్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని, అక్కడ స్ట్రీట్ లైట్లు, దోబీ ఘాట్ నిర్మాణానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ వంజరి వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు అనిల్ సర్వదే, తార్నాక రజక సేవా సంఘం అధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు వి.మైసయ్య, ఎ.హనుమంతు, కోశాధికారి పి. రాజు, నిర్వహణ కార్యదర్శి జె. శ్రీనివాస్, మల్లికార్జున్, సోమయ్య, సాలయ్య, తిరుపతి భూమయ్య, వెంకటయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement