Thursday, May 2, 2024

Bandi Sanjay: రామోజీ షణ్ముకాచారి కన్నుమూత… బండి సంజయ్​ సంతాపం

కరీంనగర్ జిల్లా ఇంఛార్జీగా కొనసాగారని, షణ్ముఖాచారి గత కొంత కాలంగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడి నిన్న అర్ధ రాత్రి 1.30 గంటలకు హైదరాబాద్ కొత్తపేటలో మృతిచెందారు. ఆయన మృతి పట్ల బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు రామోజీ షణ్ముకాచారి మరణం బాధాకరమని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలో నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడిన నాయకుడని ఎమర్జెన్సీ సమయంలో పనిచేసిన షణ్ముకాచారి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా, సంఘటనా మంత్రిగా పనిచేశారని అన్నారు.హిందూ వాహిని, భజరంగదళ్ కు సేవలందించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ విస్తరణకు క్రుషి చేశారని. 2018 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నల్లగొండ అభ్యర్ధిగా పోటీ చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటన్నారు. షణ్ముకాచారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నా బండి సంజ‌య్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement