Friday, May 3, 2024

Nirmal: గడ్డెన్న ప్రాజెక్టులో యువకుడి మృతదేహాం లభ్యం…

నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులో ఇవాళ ఓ యువకుడి మృతదేహాం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. భైంసా మండలం గుండెగాం గ్రామానికి చెందిన సూర్యవంశీ బాలాజీ (30) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని కిసాన్​గల్లీలో అద్దెకు ఉంటున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం బాలాజీ ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో కుటుంబీకులు బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకి దొరకలేదు.

ఈక్రమంలో పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్​ కేసు నమోదైంది. శనివారం ప్రాజెక్టు వైపు వెళ్లిన స్థానికులకు మృతదేహం కనిపించగా.. పోలీసులకు సమాచారం అందించారు. మత్య్సకారుల సహకారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించగా, బాలాజీ మృతదేహాంగా గుర్తించారు. ప్రాజెక్టు వద్ద పంచనామా నిర్వహిచిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement