Tuesday, April 30, 2024

సీఎం జగన్ కు ఘనస్వాగతం పలికిన మంత్రి పెద్దిరెడ్డి

సత్యసాయి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం, కదిరి, మడకశిర శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శంకర్ నారాయణ, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, తిపేస్వామి, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, సత్య సాయి సెంట్రల్ టెస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కళ్యాణదుర్గం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement