Sunday, April 28, 2024

HYD: గుండెపోటుతో డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు మృతి..

హైదరాబాద్ : మాదాపూర్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్‌ (20) మృతి చెందాడు. సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు.

కాగా చంద్రతేజ్‌ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపారంలో రానిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ లోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement