Sunday, April 28, 2024

TS: అన్నారం బ్యారేజీని పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు..

మహాదేవపూర్, (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీని ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీ ఇటీవల నీటి బుంగలు ఏర్పడ్డాయి.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అతి కొద్ది రోజుల్లోనే అన్నారం బ్యారేజ్ బుంగలు రావడం అధికారులు వాటిని పూడ్చే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో బ్యారేజ్ నుండి నీరు లీక్ లు ఆపలేకపోయారు. ఆదివారం బ్యారేజ్ నుండి నీటిని ఖాళీ చేశారు. ఇవాళ ఉదయం నుండి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement