Monday, May 6, 2024

విద్యుత్ ఘాతానికి – రైతు బ‌లి

మల్హర్ (ప్రభన్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లేకుంటలో విద్యుత్ ఘాతానికి రైతు బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వల్లెం కుంట గ్రామానికి చెందిన రైతు పుల్లురి చిన్న లింగరావు(53) సోమవారం ఉదయం సమీప మానేరులోని తన కరంట్ మోటార్ వద్ద మోటార్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్ వచ్చింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. రైతు మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement