Monday, April 29, 2024

TS: కృతజ్ఞత ర్యాలీకి భారీగా జనం… ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘనస్వాగతం

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 25 (ప్రభ న్యూస్) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అకుంఠిత పోరాటంతో కేంద్రం మహిళా బిల్లు ప్రవేశపెట్టినందుకు, నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ రూ.60కోట్లు ప్రకటించినందుకు నిజామా బాద్ నగరంలో ఇవాళ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్, నగర మేయర్ దండు నీతి కిరణ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఐటిఐ గ్రౌండ్ నుండి నెహ్రు పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. గులాబీ జెండాలతో ఇందూరు గులాబీ మయమైంది. కృతజ్ఞత ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా నగర ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గజమాలతో ఘనస్వాగతం …

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరంలోని బోర్గం కమాన్ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement