Friday, May 3, 2024

Shamshabad: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

రోడ్డుప్ర‌మాదంలో దంప‌తులు మృతిచెందిన ఘ‌ట‌న‌ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం షాద్ నగర్ రోడ్డుమార్గంలోని ఘాన్సీమియాగూడ సమీపంలో వేగంగా వచ్చిన ఓ షిఫ్టు కారు, ఆటో, బైక్ లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ కల్వర్టులోకి దూసుకెళ్లాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు మృతి చెందారు. ఆటో, బైక్ లో వెళ్తున్న పలువురు గాయప‌డ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement