Sunday, April 28, 2024

భారీ వర్షాలతో పంట నష్టం – మనస్థాపంతో పత్తి రైతు బలవన్మరణం

ములుగు జిల్లా దేవగిరి పట్నం గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ రైతు తన అరు ఎకరాలలో పత్తి సాగుచేస్తున్నాడు.. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టం జరగడంతో, రైతు రామకృష్ణారెడ్డి మనస్థాపం చెంది పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ‌‌.

చుట్టుపక్కల ఉన్న రైతులు ,కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ములుగు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లారు, చికిత్స పొందుతూ మరణించారు. కుటుంబ సభ్యుల పెద్ద కోల్పోవడంతో, కుటుంబ సభ్యులు సోకసముద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement