Sunday, April 28, 2024

Bumper Offer – ఒక్క రూపాయితో దేశ వ్యాప్తంగా ఎక్కడి కైనా ప్రయాణం

ఆగస్ట్ 15న ఎక్కడికైనా జర్నీ ప్లాన్ చేసుకుంటున్నారా ..అయితే మీకో గుడ్ న్యూస్. ఆ రోజు బస్సు ప్రయాణికులకు ఒక్క రూపాయి ఛార్జీతో( ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్‌ సేవలందిస్తున్న న్యూగో సంస్థ(Nuego ).పర్యావరణ పరిరక్షణతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణంపై అవగాహన కల్పించడంలో భాగంగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఆగస్ట్ 15వ తేది నాడు ఒక్క రూపాయికే దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తమ సంస్థ బస్సుల్లో ప్రయాణించే బంపర్ ఆఫర్‌ని అందిస్తోంది

న్యూగో సంస్థ. బెంగుళూరు-తిరుపతి, హైదరాబాద్‌- విజయవాడ, చెన్నై- పుదుచ్చెరి, ఇండోర్-భోపాల్,ఢిల్లీ -చంఢీగడ్, ఢిల్లీ -ఆగ్రా, ఢిల్లీ -జైపూర్,ఆగ్రా-జైపూర్‌ ఈ మార్గాల్లో తిరిగే బస్సులో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక ఒక్క రూపాయికే లగ్జరీ జర్నీ చేయడానికి టికెట్ బుక్ చేసుకోమని న్యూగో సంస్థ వెబ్‌సైట్‌ లాగిన్ లింక్‌ని పొందుపరిచింది. దీనితో పాటు మొబైల్ యాప్‌లో కూడా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement