Monday, May 6, 2024

TS: నిజామాబాద్ లో అభివృద్ధి కంటే అవినీతి పది రెట్లు ఎక్కువ.. షబ్బీర్ అలీ

నిజామాబాద్ సిటీ, నవంబర్ 14 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ అర్బన్ లో అభివృద్ధి కంటే పది రెట్లు ఎక్కువ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్ర శేఖర్ కాలనీలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ బట్టలను ఇస్త్రీ చేస్తూ… టీ పాయింట్ వద్ద చాయ్ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం చేపట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లడుతూ… తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి మారలేదన్నారు. రాష్ట్రం సిద్ధించి తొమ్మిదేళ్లు అవుతున్నా యువత నిరుద్యోగంతో మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాడవాడలా తిరుగుతూ ప్రజల సమస్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతుందన్నారు. సమస్యలన్నీ తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు.


ఓటర్లను కలుస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని షబ్బీర్ అలీ కోరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి వివరించారు. అర్హులందరికీ ఫించన్​ రావడం లేదన్నారు. లబ్ధిదారులకు తెల్లరేషన్​ కార్డులు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్​కి నిజామాబాద్ కంచుకోటలా ఉందన్నారు. పాదయాత్రలో సర్వ కుల, మతాల ప్రజలు బ్రహ్మరథం పడుతూ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు తహర్ బిన్ హందన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ MLC ఆకుల లలిత, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త నిహార్, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్, జిల్లా NSUI అధ్యక్షులు వేణు,స్వామి గౌడ్, సబర్, నూర్, ప్రవీణ్ గౌడ్, సత్యనారాయణ యాదవ్, ప్రకాష్ గౌడ్, తతిదరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement