Tuesday, April 30, 2024

Boycott : ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన బిజెపి… అక్బరుద్దీన్ ప్రొటెమ్ స్పీకర్ ఎంపికపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ శాసన సభ సంప్రదాయాలను కాల రాసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్నితమ బీజేపీ పార్టీ సభ్యుల బహిష్కరించారని వెల్లడించారు..

మజ్లిస్ పార్టీ తో చేసుకున్న ఒప్పందం మేరకు సీనియర్ లను కాదని దొడ్డిదారిన ఎంఐఎం అక్బరుద్దీన్ ను ప్రోటెం స్పీకర్ ఆ చేశారని ఆరోపించారు. సీనియర్ లను పక్కన పెట్టీ అక్బరుద్దీన్ ఓవైసీని… ప్రోటెం స్పీకర్ చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ ఎంపికతో కాంగ్రెస్ కు ఎంఐఎంపార్టీకి లోపాయకార ఒప్పందం బయట పడిందన్నారు. ఎంఐఎం, బీజేపీ ఒకటి అని దుష్ప్రచారం చేశారని, అయితే నిజానికి కాంగ్రెస్, మజ్లీస్ ఒక్కటేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement