హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు వీ.హనుమంతరావు మాట్లాడుతూ.. ముందుగా సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్లలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.