Monday, April 29, 2024

రేవంత్ పాద‌యాత్ర – ఉప్పల్ లో రెండు వర్గాల మ‌ధ్య‌ ఘర్షణ

ఉప్పల్: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా కాంగ్రెస్ లోని రెండు వ‌ర్గాలు బాహ‌బాహికి దిగాయి.. ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్నారు. వివ‌రాల‌లోకి వెళితే ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ కాంగ్రెస్ నాయకులే ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు.

ఉప్పల్ బస్ స్టాండ్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న ఉప్పల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి. రాగిడి లక్ష్మారెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మందుముల పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించివేశారు.. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వివాదం మొద‌లైంది.. అనంత‌రం ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది.. దీంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఇరువ‌ర్గాల‌ను అక్క‌డి నుంచి త‌రిమివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement