Monday, April 29, 2024

పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు

వాజేడు, మే 1 ప్రభ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగిన విషయం విధితమే. సమ్మెలో భాగంగా నాల్గవ రోజు పంచాయతీ కార్యదర్శులు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో నిర్వాహక దీక్ష చేపట్టగా వాజేడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షలో పాల్గొని పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తల్లడి ఆదినారాయణ కాకర్లపూడి విక్రాంత్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులను గత నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేయించుకొని రెగ్యులరైజేషన్ చేయకుండా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు పంచాయతీ కార్మికులు మద్దతు ప్రకటించారు. సీపీఎం పార్టీ నాయకులు కూడా పంచాయతీ కార్యదర్శులకు మద్దతు ప్రకటిస్తూ దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాట్ల వాసుబాబు, వత్సవాయి జగన్నాథరాజు, పంచాయతీ కార్మికులు, పంచాయతీ కార్యదర్శులు, సీపీఎం పార్టీ నాయకులు దబకట్ల లక్ష్మయ్య, కొప్పుల రఘుపతి, జజ్జరి దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement