Sunday, April 28, 2024

TS : కాంగ్రెస్ పార్టీ మాట‌లకే.. చేత‌ల‌కు కాదుః కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మాటలకే కానీ చేతలకు కాదని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఎద్దెవా చేశారు. ఇవాళ హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న రైతుదీక్ష‌ను చేప‌ట్టారు. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా అందజేయాలని అన్నారు.

- Advertisement -

అలాగే, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు. వరికి 5 వందల రూపాయల బోనస్ అందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులకు 25వేల రూపాయలు ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో రైతులపై హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement