Sunday, April 28, 2024

పెట్రో ధరల పెంపుకు నిరసనగా రాస్తారోకో

పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సోమవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి నిత్యం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేదలు కడుపునిండా తినలేని పరిస్థితి నెలకొందన్నారు. రాస్తారోకోలు మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement