Sunday, May 5, 2024

RR : వికారాబాద్‌లో ప్ర‌చారం నిర్వ‌హించిన కాంగ్రెస్ నేత‌లు

వికారాబాద్, నవంబర్ 20 (ప్రభ న్యూస్): రాబోయే శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందడం ఖాయమని వికారాబాద్ పట్టణ‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ,కొత్తగడి కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు ప్రచారం నిర్వహించారు. ఇంటి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వి. సత్యనారాయణ, కౌన్సిలర్లు దేవి రెఢ్యా నాయక్, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, అబ్దుల్ కాలేధ్, ఆనందం, శివానందం, పట్టణ మహిళా అధ్యక్షురాలు పల్లవి, నాయకులు మేనక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement