Friday, May 17, 2024

attack :బీఎస్పీఎమ్మెల్యే అభ్య‌ర్థిపై గొడ్డ‌లితో దాడి.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

సూర్యపేట బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై గొడ్డలితో దాడికి పాల్ప‌డ్డారు. గొడ్డళ్లు, కత్తులతో వట్టే జానయ్య యాదవ్ పై కొంతమంది దాడికి య‌త్నించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో ప్రచారంలో భాగంగా బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ప్రచారానికి వెళ్ళారు.

ప్రత్యార్థులు జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈఘ‌ట‌న‌లో తృటిలో జానయ్యకు ప్రమాదం తప్పింది. సూర్యాపేట, ఆత్మకూరు మం. లో గట్టికల్లులో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు బీయస్పీ అభ్యర్థి వట్టి జానయ్య యాదవ్ బృందం పై గొడ్డలితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement