Monday, April 29, 2024

రాహుల్ గాంధీపై వ్యాఖ్యాలు – కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

కొత్తకోట, జూలై 18 (ప్రభ న్యూస); జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దయ దక్షిణాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన రాజ్యమేలుతుందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం గూర్చి మాట్లాడే నైతిక అర్హత కెసిఆర్ కేటీఆర్ కుటుంబాలకు లేదని అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాలని నినాదాలు చేశారు.

అనంతరం కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెపాగు ప్రశాంత్ మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తన అహంకారానికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు పేరుతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం , రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని ప్రభుత్వం.. రైతుబంధు పేరుతో వ్యవసాయ పనిముట్లను దూరం చేస్తూ.. రైతులను దగా చేస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి చెల్లుతుందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెపాగు ప్రశాంత్ కొత్తకోట టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గొల్ల బాబు, బోయజ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,కొత్తకోట మండల ప్రధాన కార్యదర్శి బీచుపల్లి,జేసెబి రాములు,కౌన్సిలర్ నాగన్న,శేఖర్ రెడ్డి, లక్ష్మన్న, ఆర్ ముజీబ్, రాములు, ముస్తఫా, హబీబ్, రమేష్, షఫీ, శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రశాంత్, ప్రతాప్ రెడ్డి, దిలీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement