Thursday, May 2, 2024

రాహుల్ గాంధీని కలిసిన రాధిక వేముల..న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత

భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కి చేరుకుంది. వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల రాహుల్ ని కలిసి ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చారు. ఈరోజు తనను కలిసిన రోహిత్ తల్లిని రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాహుల్ తో కలిసి రాధిక పాదయాత్రలో నడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ ను ఆమె కోరారు. మరోవైపు మీకు పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ హామీ ఇచ్చారు. రాహుల్ తో రోహిత్ తల్లి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement