Friday, May 10, 2024

అధికారంలో ఉండి రోడ్డు ఎక్కడం సిగ్గుచేటు: కాంగ్రెస్ నేతలు

కేంద్ర, రాష్ట ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ టీపీసీసీ అదేశాల మేరకు  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల నడ్డివిరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. అధికారంలో ఉంటూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే వరి ధాన్యాన్ని ప్రతి గింజ ప్రభుత్వం కోనే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పొరాటం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement