Wednesday, May 1, 2024

టీఆర్​ఎస్​లోకి కాంగ్రెస్​ నేత నల్లాల ఓదెలు.. కేసీఆర్​తో భేటీ అయిన ఓదెలు దంపతులు

మునుగోడు రాజకీయం మరింత హీట్​ ఎక్కుతోంది. ఇప్పటికే టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ ప్రచారం ప్రారంభించి, ఎన్నికల పోరులో జోరుగా పాల్గొంటున్నాయి. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్​కు చెందిన కీలక నేత, నల్లాల ఓదెలు టీఆర్​ఎస్​లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇవ్వాల సీఎం కేసీఆర్​తో భేటీ అయినట్టు సమాచారం.

ఇవ్వాల తెలంగాణ భవన్​లో జరిగే కీలక సమావేశంలో సీఎం కేసీఆర్​ సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరనున్నట్టు సమాచారం. ఇక.. ఇవ్వాలే జాతీయ పార్టీతో పాటు మునుగోడు అభ్యర్థిని కూడా ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్​. అయితే నల్లాల ఓదెలు తనకు లోక్​సభ టిక్కెట్​ కావాలని కోరినట్టు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement