Saturday, May 4, 2024

Congress – BRS – ప్రాజెక్టుల వార్‌ … ఢీ అంటే ఢీ

లోక్‌స‌భ‌కు ముందస్తు స‌న్నాహాలు లోక్‌సభ ఎన్నికలకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రాజెక్ట్ వార్ ప్రారంభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వేగంగా కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించడానికి బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని అందుకుంది. కాంగ్రెస్ పోటీగా చలో మేడిగడ్డ కు పిలుపునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం చ‌లో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12వ తేదీతో ముగియనున్నాయి.

ఇరిగేష‌న్‌పై అసెంబ్లీలో శ్వేత‌ప‌త్రం..

12వ తేదీన‌ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల, చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13న‌ బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్ పల్లి -అద్దంకి హైవేకి ఆనుకుని ఉన్న స్థలంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు. భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు ప్లాన్‌..భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలనుకుంటున్నారు.

గత ఎన్నికల్లో నల్లగొండలో బీఆర్ఎస్ పరువు పోయేలా పరాజయం ఎదురయింది. బీఆర్ఎస్ బహిరంగ సభ తలపెట్టిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తేదీని ఖరారు చేసింది. దీంతో తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల అంశంపై రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరినట్లయింది. ఈ రాజకీయంలో బీజేపీ వెనుకబడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement