Sunday, May 19, 2024

WGL : గులాబీ గూటికి వలసలు జోరు

భూపాలపల్లి ప్రతినిధి, ప్రభన్యూస్​ : అసెంబ్లి ఎన్నికల దృష్ట్యా భూపాలపల్లి నియోజక వర్గంలో కారులోకి వలుసల జోరు కొనసాగుతోంది. వివిధ పార్టీల నుండి గులాబీ గూటికి చేరుతున్నారు. సోమవారం నూతన గోరుకొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి, సుల్తాన్పూర్, గోరికొత్తపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది కాంగ్రెస్ ,బిజెపి పార్టీల కార్యకర్తలు, నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే గండ్ర పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధి ద్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలని, రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన తనను భారీ మేజారిటీతో గెలిపించి సాగుతున్న అభివృద్ధిని కొనసాగించుకోవాలని తెలియజేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం, గౌరవం ఉంటుందని, ఏ రోజు కూడా ఏ ఒక్కరిని చిన్నచూపు చూసే మనస్తత్వం నాది కాదని, పార్టీ ఏదైనా అవసరమని నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి చేతనైన సాయం చేయగలిగే వ్యక్తిత్వం ఉన్నదని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. ఎవరు అడగకుండా గోరికొత్తపల్లి గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం మెరుగుపరచనాని ఇటీవలే దాదాపు రూ.కోటి యాభై లక్షల పైచిలుకు నిధులతో నూతన తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని తద్వారా గొరికొత్త పల్లి మండలం వ్యాపార రీత్యా చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారుం స్థానికంగా నివసించే ప్రజల మౌలిక సదుపాయాలు,జీవన ప్రమాణాలు మెరుగుపడుతుందని, రానున్న రోజులలో గోరుకొత్తపల్లి మండలం ఒక ఆదర్శ మండలంగా ఏర్పడుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement