Thursday, May 2, 2024

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు

తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై నాంపల్లి లోని రాష్ట్ర మనవాహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. పిల్లలకు విధ్యా బుద్ధులు నేర్పించాల్సిన పదవిలో ఉండి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా దేవుళ్లను నమ్మొద్దని వారితో ప్రమాణాలు చేయిస్తూ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని ఆరోపిస్తూ ఎం వెంకట రమణ శర్మ బృందం ఈ ఫిర్యాదు చేసింది. చిన్న పిల్లల మనసులో ద్వేషాలు నింపుతున్న ప్రవీణ్ కుమార్ ను తొలగించలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో ప్రవీణ్ కుమార్ వ్యవహారం పై రాష్ట్ర గవర్నర్ ను కలుస్తామని వారు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement