Monday, April 29, 2024

అదుపు తప్పి బొగ్గు లారీ బోల్తా…

మణుగూరు, ఆగష్టు 28,(ప్రభ న్యూస్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రోజు ,రోజుకు బొగ్గు లారిలు అతి వేగానికి ప్రమాదాలు ఎదో ఒక్క చోట సంభవిస్తున్నాయి.సోమవారం తెల్లవారు జామున ,మణుగూరు నుండి బిటిపియస్ కు బొగ్గు లోడుతో వెళ్ళుతున్న లారీ రామానుజ వరం గ్రామంలోని,పగిడేరు క్రాస్ రోడ్డు వద్ద, అదుపు తప్పి బోల్తా ప‌డి,చెట్టు ను డీ కోట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు. లారీ లు అతి వేగానికి మూగ జీవాలు తో పాటు మనుషులు ప్రాణాలు కోల్పుతున్నారు. లారీల అతి వేగానికి నియంత్రించాలని పలుమార్లు సంభందిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement