Sunday, April 28, 2024

TS : భువ‌న‌గిరి పార్ల‌మెంట్​లో సీఎం రేవంత్​ పర్యటన.. నియోజకవర్గ నేత‌ల‌తో స‌మీక్ష‌

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఒకవైపు నుంచి బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నేతలను మేల్కొపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్​ రెడ్డి వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, ఇవాళ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్​ రెడ్డి స‌మీక్ష నిర్వహించనున్నారు. ఆ పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనున్నారు.

- Advertisement -

ఈ సమీక్ష మీటింగ్​కు సీఎం రేవంత్​ రెడ్డి హాజరు కానున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భువనగిరి లోక్​సభ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి , ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, మందుల శామేలు, వేముల వీరేశం, మల్​రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలతో పాటు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన కో ఆర్డినేటర్లు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement