Sunday, April 28, 2024

ADB: ఇంద్రవెల్లి నుంచే సీఎం లోక్ సభ ఎన్నికల శంఖారావం.. శ్రీహరిరావు

నిర్మల్ ప్రతినిధి, జనవరి 30 (ప్రభ న్యూస్) : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈసందర్భంగా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ… ఇంద్రవెల్లి సభ నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూరిస్తారని తెలిపారు. సీఎం సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తునట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement